Monday, November 25, 2013

మూడేళ్ళు ముప్పతిప్పలు పడ్డా ముందుకే సాగా...సి.ఎం.

హైదరాబాద్,నవంబర్ 25:  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా  ఒత్తిడి తెస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం బయట మాట్లాడేది 30 శాతమే మాత్రమేనని, అంతకు మూడింతలు అధిష్టానం దగ్గర మాట్లాడానని తెలిపారు. విభజన అంశంపై గతంలో ఇందిరా గాంధీ మాట్లాడాన్ని ప్రసంగాన్ని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని తెలిపారు. అసెంబ్లీలో విభజనపై అన్ని విషయాలతో చర్చిస్తామన్నారు.  తాను వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. తన మాటల్లో స్వార్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఎంతో మేలు చేశామని, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తెలంగాణకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు 14ఎఫ్ తొలగింపు కోసం ఆందోళన చేశారని చేశారని, దాన్ని తొలగించామని ఆయన అన్నారు.సమైక్యమా? కాంగ్రెస్ పార్టీనా అనేది రాకూడదనుకుంటున్నానని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని కిరణ్ తెలిపారు. అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్లు ఎప్పుడొస్తుందో తెలీదని, అసెంబ్లీ ప్రొరోగ్ విషయం చాలా చిన్న విషయమన్నారు. సీఎంగా   ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని అన్నారు. విద్యారంగంలో పారదర్శకతను తీసుకొచ్చామని, మీ సేవా ద్వారా 192 సేవలు తీసుకొచ్చామని తెలిపారు. ఎస్సీఎస్టీల కోసం చారిత్రకమైన చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకున్నామని ఆయన చెప్పారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...