Tuesday, November 12, 2013

నాలుగో విడత కక్ష్య పొడిగింపు విఫలం

బెంగళూరు, నవంబర్ 12:  ‘మార్స్ ఆర్బిటర్’ ఉపగ్రహం కక్ష్యను నాలుగో సారి  పొడిగించేందుకు  సోమవారం చేపట్టిన ప్రక్రియ విఫలమైంది. భూమి నుంచి 71,623 కిలోమీటర్ల దూరంలోనున్న కక్ష్యను లక్ష కిలోమీటర్ల దూరానికి పొడిగించేందుకు ప్రక్రియను నిర్వహించగా, కేవలం 78,276 కిలోమీటర్ల దూరానికి మాత్రమే చేరుకోగలిగింది. లిక్విడ్ ఇంజన్‌కు ఇంధన ప్రవాహం నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కక్ష్య పొడిగింపు ప్రక్రియలో ‘మార్స్ ఆర్బిటర్’ వేగం సెకనుకు 130 మీటర్ల మేరకు పెరగాల్సి ఉండగా, కేవలం సెకనుకు 35 మీటర్ల వేగానికి మాత్రమే పరిమితం కావడంతో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.  అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ‘మార్స్ ఆర్బిటర్’ వందశాతం సురక్షితంగానే ఉందని ‘ఇస్రో’ ప్రతినిధి  తెలిపారు.  ‘మార్స్ ఆర్బిటర్’ కక్ష్య పొడిగింపు ప్రక్రియను ఈనెల 7 నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి మూడు విడతల్లో నిర్వహించిన కక్ష్య పొడిగింపు ప్రక్రియలు విజయవంతమయ్యాయని ‘ఇస్రో’ వెల్లడించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...