Friday, November 8, 2013

హాస్య నటుడు ఏవీఎస్ ఇక లేరు...

హైదరాబాద్, నవంబర్ 8 : హాస్య నటుడు, రచయిత, దర్శకుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా లీవర్, మూత్పపిండాల వ్యాధితో బాధపడుతూ పది రోజుల నుంచి నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో
పొందుతుండగా,  పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఈ సాయంత్రం ఏవీఎస్‌ను ఆయన కుమారుడు ప్రదీప్ నివాసం ఉంటున్న మణికొండకు తీసుకు వచ్చారు. ఇంటికి తీసుకు వచ్చిన కొద్ది గంటలలోనే ఏవీఎస్ మృతి చెందారు. నాలుగు సంవత్సరాల క్రితం ఏవీఎస్ లీవర్ సమస్యతో బాధపడ్డారు. అప్పుడు ఆయన కుమార్తె దానం చేయడంవల్ల గ్లోబల్ ఆస్పత్రిలో లీవర్ టాన్స్‌ఫ్లాంటేషన్ జరిగింది. తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించారు. ఏవీఎస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం, గుంటూరు జిల్లా తెనాలిలో 1957 జనవరి రెండున ఆయన జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన ఏవీఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఏవీఎస్ నటించిన ఆఖరి చిత్రం 'పవిత్ర'. మిస్టర్ పెళ్లాం సినిమాకు ఏవీఎస్‌కు నంది అవార్డు వచ్చింది. 19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించారు. 'అంకుల్' సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవీఎస్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. 'మా' జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...