Tuesday, November 5, 2013

పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగం సక్సెస్....కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ మిషన్‌

హైదరాబాద్,నవంబర్ 5:   అంతరిక్ష రంగంలో భారత్  మరో విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24న అంగారకునిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనుంది.  అంగారక గ్రహంపై జీవాన్వేషణ, వాతావరణం, ఖనిజాల పరిశోధన కోసం ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. తొమ్మిది నెలలపాటు ప్రయాణించి 2014, సెప్టెంబర్ 24న ఈ ఉపగ్రహం అంగారకునిపై కాలు మోపనుంది. అక్కడ నుంచి ఈ శాటిలైట్ ఎప్పటికప్పుడు ప్రయోగాలు నిర్వహిస్తూ ఫలితాలను భూమిపైకి పంపనుంది. ఇస్రో ఈప్రాజెక్టు కోసం రూ.450 కోట్లు వెచ్చించి మొదటిసారిగా అంగారకునిపైకి ఉపగ్రహాన్ని పంపించింది. 320 టన్నుల బరువు (ఉపగ్రహం బరువుతో కలసి), 44.4 మీటర్ల ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ 1,337 కిలోల మార్స్ ఉప గ్రహంతో రోదసీలోకి దూసుకుపోయింది.   24 పీఎస్ఎల్వీ ప్రయోగాలలో తొలి ప్రయోగం మినహా మిగిలిన 23 వరుస విజయాలను అందించిన పీఎస్ఎల్వీ సిరీఅ లో  25వ రాకెట్‌గా (సిల్వర్‌జుబ్లి రాకెట్) పీఎస్ఎల్వీ-సీ25ను ప్రయోగించారు..  భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనదని  మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...