ముంబై,అక్టోబర్ 31: వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. టెస్టు జట్టుకు ఎంపిక కావడంలో పేస్ బౌలర్ జహీర్ ఖాన్ విఫలమయ్యాడు. హర్భజన్ సింగ్ను పక్కన పెట్టి రోహిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించారు. భుజం గాయం కారణంగా రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. ఇషాంత్ శర్మకు చోటు కల్పించారు. బౌలర్లలో షమీ అహ్మద్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్లు జట్టులో స్ధానం పొందారు. శిఖర్ ధావన్తో కలిసి ఇన్నింగ్సు ప్రారంభించిన మురళీ విజయ్కు జట్టులో స్థానం లభించింది. జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా, అంజిక్యా రహనే, ఉమేష్ యాదవ్, షమీ అహ్మద్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ. వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్ సచిన్ టెండూల్కర్కు చివరిది కానుంది.సచిన్ టెండూల్కర్ తన 199వ మ్యాచును కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో, 200వ మ్యాచును వెస్టిండీస్తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడనున్నాడు. వాంఖడేలో ఆడే 200వ మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment