Sunday, October 27, 2013

సమైక్య సభలో జగన్ ఎన్నికల ప్రసంగం !

 హైదరాబాద్  , అక్టోబర్ 27: "రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు పోరాడదాం. అవసరమైతే 2014 వరకు పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు గెలిపించుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో రాజకీయాలను మనమే శాసిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు విడదీస్తారో చూద్దాం'' అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావంసభలో  జగన్ మట్ల్లాడుతూ,  ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి  పోరాటం జరుగుతోందన్నారు. మౌనంగా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను.. భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలను ఓట్లు, సీట్ల కోసం ముక్కలు చేస్తారని, అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఓట్లు, సీట్ల రాజకీయాలను నిలువరించవచ్చని సూచించారు. "విభజనకు సహకరించి చరిత్రహీనులుగా మిగులుతారా? ప్రజలకు తోడుగా ఉంటారా?'' అని సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రశ్నించారు.  1983లో భారతదేశ పౌరసత్వం తీసుకున్న సోనియాతో సహా   పౌరసత్వం తీసుకున్న వారంతా దేశం విడిచి వెళ్లాలనే బిల్లు పార్లమెంట్‌లో వస్తే సోనియాకు నచ్చుతుందా? అని  నిలదీశారు.  అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా అని సోనియాను ప్రశ్నించారు. మీ అత్త ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువుకో అంటూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇందిర చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకించారు. తెలుగు జాతిని చీల్చాలనుకోవడం న్యాయమేనా? బలమైన రాష్ట్రాన్ని బలహీనం చేయడం సబబేనా అని సోనియాను ప్రశ్నించారు.  సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా ఎందుకు చేయలేదు ?  అసెంబ్లీని సమావేశపరచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేద్దామని కిరణ్‌ను కోరాం. దాంతో దేశంలో అలజడి వస్తుందని చెప్పాం. గవర్నర్‌కు విన్నవించాం. నేను, మా అమ్మ దీక్షలు చేశాం. సీఎం కార్యాలయం వద్ద ధర్నాలు చేశాం. ముసాయిదా బిల్లు రాకముందే సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్న మా ప్రయత్నం అరణ్య రోదనే అయింది'' అని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...