Sunday, October 27, 2013

కిరణ్ లేఖను కేంద్ర హోంశాఖకు పంపిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ , అక్టోబర్ 27:   రాష్ట్ర విభజన అంశంలో సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పరిశీలనార్థం పంపారు. విభజన ప్రక్రియలో గత సంప్రదాయాలను విస్మరించి, ఇష్టానుసారం ముందుకెళ్లరాదని సూచిస్తూ, సీఎం  రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్స్‌లో అందిన ఈ లేఖను ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలమేరకు రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు పంపినట్టు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఏ ముఖ్యమంత్రి లేఖనైనా పరిశీలన, తదుపరి చర్యలకోసం సంబంధిత శాఖకు లేదా ప్రధాని కార్యాలయానికి పంపుతారని, అలాగే కిరణ్ లేఖనూ పంపారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విభజనపై జీవోఎం కసరత్తు సాగుతున్నందున సీఎం లేఖపై ప్రభుత్వపరంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండబోవని, జీవోఎం తదుపరి సమావేశంలో దీనని పరిశీలించే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
అలాగా-నాకు తెలియదే...దిగ్విజయ్
అయితే  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాగా మరోవైపు కేంద్రమంత్రి చిరంజీవి ....ముఖ్యమంత్రి లేఖతో పాటు ఆయన వ్యాఖ్యలను సమర్థించారు.  విభజన ప్రక్రియ సరిగా జరగటం లేదని చిరంజీవి అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...