Wednesday, October 30, 2013

మహబూబ్‌నగర్‌ వద్ద బస్సు దగ్ధం:42 మంది సజీవ దహనం

హైదరాబాద్, అక్టోబర్ 30: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు.  కొత్తకోట మండలం పాలెం ఎన్ హెచ్ 44 పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న 49 మంది ఉన్నట్టు సమాచారం. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రమాదం జరిగింది. ఏసీ బస్సు కావడంతో లోపల ఉన్న ఫాబ్రికేషన్ మెటీరియల్, ఏసీలో ఉండే గ్యాస్, కర్టెన్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.  మిగిలిన ప్రయాణికులంతా మరణించారనే భావిస్తున్నారు. కాగా, ఇంతవరకు 41 మృత  దేహాలు వెలికి తీశారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...