Saturday, October 12, 2013

సీమాంధ్రలో మళ్ళీ రోడ్డెక్కిన బస్సులు....చల్లారుతున్న ఉద్యమ వేడి

 హైదరాబాద్, అక్టోబర్ 12 :  సమైక్య రాష్ట్ర డిమాండ్‌తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, ఆర్టీసీని ప్రభుత్వమే నిర్వహించడం వంటి పలు డిమాండ్లతో ఆగస్టు 13న సీమాంధ్రకు చెందిన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి  నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు. ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు కూడా ఇంతకు ముందే సమ్మె విరమించడంతో సమైక్యాంధ్ర ఉద్యమ వేడి చాల వరకు చల్లారింది. ఇక ఎన్. జి. ఓ.లు మాత్రమె ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...