Wednesday, October 16, 2013

రెండవ వన్ డేలో భారత్ అపూర్వ విజయం...

జైపూర్, అక్టోబర్ 16:  భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదయింది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్   9 వికెట్లతో  కంగారూలను చిత్తుచేసి మొదటి మ్యాచ్ లో ఓటమికి బదులు తీర్చుకుంది. ఆసీస్ నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే   43.3 ఓవర్లలో  కేవలం ఒకే వికెట్ నష్టంతో  362 పరుగులు చేసింది. ప్రపంచ వన్డే క్రికెట్ లో రెండో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.    రోహిత్, కోహ్లి సెంచరీలతో హోరెత్తించారు. శిఖర్ ధావన్  తృటిలో శతకం కోల్పోయినా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ అవుటయిన తర్వాత క్రీజ్ లో అడుగుపెట్టిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత్ తరపున వేగంగా సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. ప్రపంచ ఆటగాళ్లలో ఏడో బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 16వ సెంచరీ. 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లి కంటే ముందు రోహిత్ సెంచరీ సాధించాడు. 102 బంతుల్లో 11 ఫోర్లు, ౩ సిక్సర్లతో శతకం పూర్తి చేసిన రోహిత్ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధావన్ 95 పరుగులు చేసి ఫాల్క్‌నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...