Saturday, October 12, 2013

విభజన ప్రక్రియకు శ్రీకారం....

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు అయిన మంత్రుల బృందం శుక్రవారమిక్కడ సమావేశమైంది.  హోం శాఖ కార్యాలయం ఈ జరిగిన  తొలి సమావేశానికి ఐదుగురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రక్షణ మంత్రి ఆంటోని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆర్థిక మంత్రి చిదంబరం ఈ భేటీకి రాలేదు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అధ్యక్షతన  జరిగిన ఈ సమావేశంలో మంత్రులు గులాంనబీ ఆజాద్‌, జైరామ్‌ రమేశ్‌, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొత్తం 11 అంశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం మంత్రుల కమిటీకి నిర్దేశించింది .రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను మంత్రులు కమిటీ పరిశీలించింది.  ఈ నెల 19న మరో దఫా సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. విధివిధానాలకు సంబంధించి నోడల్ మినిస్ట్రీస్, డిపార్ట్ మెంట్లను ఖరారు చేసినట్లు మంత్రుల బృందం తెలిపింది.   ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, అన్ని సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తామని రిమంత్రుల బృందం హామీ ఇచ్చింది.
 సీమాంధ్రకు   ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ?
 రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ప్రాంతానికి  ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజితోపాటు, అత్యాధునిక వసతు లతో రాజధాని ఏర్పాటు అంశాలతో బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే..తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి చేజారవచ్చనే ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అందుచేత  హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి మొగ్గు చూపడం లేదని సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...