Saturday, October 12, 2013

నిమ్స్‌ నుంచి జగన్‌ డిశ్చార్జ్‌...

హైదరాబాద్,అక్టోబర్ 12:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  కీటోన్స్‌ మినహా... చక్కెరస్థాయి తదితరాలన్నీ సాధారణస్థాయికి వచ్చినట్టు  వైద్యపరీక్షల్లో తేలటంతో వైద్యులు...జగన్ ను డిశ్చార్జ్‌ చేశారు.  కీటోన్స్‌ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు శనివారం తెలిపారు. మూడు రోజుల పాటు విశ్రాంతి  తీసుకోవాలని సూచించారు.సమైక్యాంధ్ర డిమాండ్‌తో  ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జగన్‌ ఆరోగ్యం క్షీణించటంతో ఈనెల 9న అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించారు.   వైద్యులు బలవంతంగా  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు.  
...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...