నాగపూర్,అక్టోబర్ 30: ఆస్ట్రేలియాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారమిక్కడ జరిగిన ఆరో మ్యాచ్ లో ఆరు వికెట్లతో గెలుపొందింది. 351 పరుగుల బారీ లక్ష్యాన్ని ధోనీసేన నాలుగు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసి విజయావకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 115 నాటౌట్) మరోసారి మెరుపు సెంచరీ సాధించగా, ఓపెనర్లు శిఖర్ ధవన్ (100), రోహిత్ (79) శుభారంభం అందించారు. సిరీస్ లో రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దవగా, చివరి మ్యాచ్ జరగాల్సివుంది.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 350 పరుగులు చేసింది. జార్జి బెయిలీ (156), వాట్సన్ (102) సెంచరీలతో రాణించారు. వోజెస్ 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment