Monday, September 9, 2013

హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రం...?

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలకాంశంగా మారిన హైదరాబాద్ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధికి జాతీయ రాజధాని ప్రాంతం పేరిట ప్రత్యేక హోదా కల్పించి మూడు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  చురుకుగా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అవతరిస్తాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండిఏలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)గా ఉంటుంది.కాగా,  కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉంది. దీనినిఅవసరమైతే మరో ఏడేళ్ల వరకూ పెంచేందుకూ అవకాశం ఉంది. ఇకో  ప్రతిపాదన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వేరేచోట తమ ప్రాంతాల్లో సొంతంగా రాజధానులను నిర్మించుకోవడం. అయితే ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రజలు అంగీకరించే అవకాశం లేనందున మూడు రాష్ట్రాల ప్రతిపాదన వైపే  కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కు హెచ్‌ఎండిఏగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదా కల్పిస్తారు. ఇందువల్ల  హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ తరహాలో పరిమిత అధికారాలతో కూడిన అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. 32 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. శాంతి భద్రతలు, భూమి, పబ్లిక్ ఆర్డర్, కోర్టులు, ఫీజులుపై కేంద్రానికి అధికారం ఉంటుంది. రాయలసీమ, ఆంధ్రాకు భౌగోళిక అనుసంధానం ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నాల్గవ సిఫార్సు మేరకు హెచ్‌ఎండిఏను యుటి రాష్ట్రంగా చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాల భోగట్టా...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...