Tuesday, September 10, 2013

జగన్‌ కేసులో పొన్నాల, సబితలకు ఊరట

హైదరాబాద్,సెప్టెంబర్ 10:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఇండియా సిమెంట్స్ అంశంలో, మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పెన్నా సిమెంట్స్ అంశాలలో క్లీన్ చిట్ లభించింది. సిబిఐ మంగళవారం జగన్ ఆస్తుల కేసులో భారతి, ఇండియా, పెన్నా సిమెంట్స్ కేసులతో పాటు మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.   ఇండియా సిమెంట్ అంశంలో సిబిఐ గతంలో పొన్నాల లక్ష్మయ్యను ప్రశ్నించింది. దీంతో ఆయన పేరు నిందితుల జాబితాలో ఉంటుందని భావించారు. ఆయన పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చడంతో ఊరట లభించింది. గతంలో సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల పేర్లను ఛార్జీషీటులో పేర్కొనడంతో వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. పెన్నా సిమెంట్ అంశంలో సబితకు తాజాగా క్లీన్ చిట్ లభించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...