Tuesday, September 10, 2013

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు...

 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు వినయ్‌శర్మ, ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్‌గుప్తాలను సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. న్యాయమూర్తి యోగేష్‌కన్నా ఈ తీర్పును వెలువడించారు.వీరికి  బుధవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం దోషులను తీహార్ జైలుకు తరలించారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిని ఆరుగురు నిందితుల్లో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మైనర్ నిందితుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...