Wednesday, September 11, 2013

86 రోజుల అనంతరం తెరుచుకున్న కేదార్ నాథ్ గుడి ద్వారాలు...

కేదార్‌నాథ్,సెప్టెంబర్ 11:  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సం వల్ల కేదార్‌నాథ్ ఆలయంలో  నిలచి పోయిన పూజలు  86 రోజుల అనంతరం బుధవారం తిరిగి  ప్రారంభం అయ్యాయి.  24మంది పురోహితుల బృందం ఆలయ కమిటీ సమక్షంలో పూజలు నిర్వహించింది.  ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. శుద్ధికరణ్, ప్రయాచిత్తీకరణ్‌లతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.   ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం పై  ఈ నెల  30న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...