హైదరాబాద్,ఆగస్టు 9: రాష్ట్ర విభజన , తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ విరుచుకుపడ్డారు.రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందని కేసీఆర్ అన్నారు. చరిత్రను వక్రీకరించి సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు సీఎంకు లేదన్నారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై సీఎం చెప్పిన లెక్కలన్నీ తప్పని కేసీఆర్ అన్నారు. సీఎం చెప్పిన లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్ధమన్నారు. కిరణ్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరెంట్ కొరతను చూపి తెలంగాణ వాసులను సీఎం కిరణ్ భయపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తమ ప్రాంతానికి 6800 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు. లోటును పూడ్చుకునేందుకు కేంద్రం 1000 మెగావాట్ల విద్యుత్ తీసుకుంటామన్నారు. ఛత్తీస్ గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ఎదుగుతామని కేసీఆర్ చెప్పారు. హైకోర్టు విషయంలో సీఎం కిరణ్ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని, 1919లోనే తెలంగాణలో హైకోర్టు ఏర్పడిందని, 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడిందని తెలిపారు. హైదరాబాద్ లో ఆంధ్ర అడ్వకేట్లు 5 శాతం మందే ఉన్నారని వెల్లడించారు. ఆంధ్ర ప్రాంతీయులను వెనక్కి వెళ్లిపొమ్మని ఎవరు చెప్పారు? ఎవరైనా పొమ్మంటే ముందు నేనే కొట్లాడతనని ఆయన చెప్పారు. ఎవరినీ ఎవరూ పొమ్మనరని ఎన్ని సార్లు చెప్పాలి? హైదరాబాద్కు తెలుగు చలన చిత్ర పరిశ్రమ వచ్చింది, ఆంధ్ర ప్రాంతంవారు చలన చిత్ర పరిశ్రమలోకి చొచ్చుకుపోవడానికి చారిత్రక ారణాలున్నాయని, ఇప్పుడిప్పుడే తెలంగాణావారు చిత్ర పరిశ్రమలోకి వస్తున్నారని, అయినా చిత్ర పరిశ్రమవారిని కడుపులో పెట్టుకుంటామని, ఇక ఎవరికైనా భయాందోళనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. విడిపోతే ఆంధ్రప్రాంతానికి నష్టం అన్న ముఖ్యమంత్రి కలిసుంటే తెలంగాణాకు లాభం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. విభజన సందర్భంలో కొన్న భయాందోళనలు, అపోహలు తలెత్తడం సహజం, కాని ఈ సమయంలో ఆ భయాందోళనలను పోగొట్టవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గౌరవప్రదంగా, పరస్పర విశ్వాసంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఒరియా వారు మా కార్యాలయం పక్కనే గుడి కట్టుకున్నారు, వారికి ఉత్సవం జరిగినప్పుడు మా తెలంగాణ భవన్లోనే పార్కింగ్ పెట్టుకుంటారని, మేము ఖాళీ చేసి ఇస్తామని, అది సంస్కారం అని ఆయన చెప్పారు. కావాలంటే సీఎం కూడా హైదరాబాద్లో కర్రీపాయింట్ గానీ, టిఫిన్ సెంటర్ గానీ పెట్టుకుని ఉండవచ్చునని కేసీఆర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment