Thursday, August 8, 2013

19 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్, ఆగస్టు 8 : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు  అవరోధాలు  తొలగిపోయాయి. ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని  హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని సూచించింది.యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్‌ నిర్వహించగా, జూన్‌ 5న ఫలితాలు వెలువడ్డాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...