Friday, August 9, 2013

సి.ఎం. సందేహాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుంది...దిగ్విజయ్

న్యూఢిల్లీ,ఆగస్టు 9:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సందేహాలను ఎకె ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని, అన్ని వర్గాలతో చర్చించి సమస్య పరిష్కారం దిశగా ఆ కమిటీ సూచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం చెప్పారు. కిరణ్ లేవనెత్తిన అభ్యంతరాలపై కమిటి దృష్టి పెడుతుందన్నారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు. ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.. సమస్యల పైన దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకేనని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...