హైదరాబాద్, ఆగస్టు 5: హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తమకు హైదరాబాదుపై ఎనలేని అభిమానం ఉందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మూలాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని, అందువల్ల ఆందోళన చేస్తున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వారు ఏ భావనతో ఉన్నారో తాను అదే భావనతో ఉన్నానని అన్నారు. పదవిలో ఉంటేనే పార్లమెంటులో విభజనపై వాణిని వినిపించగలుగుతామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పదవులే ఆధారమని చిరంజీవి అన్నారు. విగ్రహాలను, ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment