హైదరాబాద్, ఆగస్టు 5: కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాష్ట ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కేంద్రంలోని పెద్దలు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత నాయకులతో వేరే మాట చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతున్న నాటకానికి నిరసనగా రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్కు ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నా మని. వ్యక్తిగతంగా రమ్మని స్పీకర్ నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్లి రాజీనామాను ధ్రువీకరిస్తానని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment