Tuesday, August 6, 2013

బాబాయ్ కి ' అనంత " బాధ్యతలు అప్పగించిన జగన్...

అనంతపురం, ఆగస్టు 6: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తన వైపు వచ్చిన  బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డికి  జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు  బాధ్యతలు అప్పగించారు.   అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గంలతో పాటు హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా వైయస్ వివేకానంద రెడ్డిని నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు శాసనసభా నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వైయస్ వివేకానంద రెడ్డికి జగన్ అప్పగించారు. అయితే, కడప జిల్లా నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని  దూరంగా  పెట్టి  అనంతపురం జిల్లా బాధ్యతలను ఏ ఉద్దేశంతో అప్పగించారనేది అంతుపట్టని విషయం...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...