Thursday, August 8, 2013

అడ్డగోలుగా విభజిస్తే అనర్ధాలు తప్పవు...సి.ఎం.

హైదరాబాద్, ఆగస్టు 8 : ఒక కొత్త రాష్ట్రాన్ని ఇవ్వాలనే ఉత్సాహంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎదుర్కోబోయే సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రెండువైపులా ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందు పెట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. సి.డబ్ల్యూ.సి. నిర్ణయం అనంతరం తొమ్మిది రోజుల తరవాత   గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి  ఎవరి కోరికమేరకో, ఉద్యమాల కోసమో రాష్ట్రాలు ఏర్పడవు అని ఆయన చెప్పారు. మీ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని మీరు బద్ధులు కారా అని మీడియా ప్రతినిధులు పదే పదే  ప్రశ్నించగా పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతించడం లేదు, అలా అని వ్యతిరేకించడంలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అంశంపై తొమ్మిది రోజులుగా సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనలపై  ఆవేదన వ్యక్తం చేస్తూ ఎవరు ఏ రకమైన ఆందోళనలనైనా నిర్వహించవచ్చునని,  నిరసనలనైనా వ్యక్తం చేయవచ్చునని, కాని ఏదైనా శాంతియుతంగా జరగాలని ఆయన అన్నారు. జాతీయ నాయకులు ప్రత్యేకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను తీర్చిదిద్దిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి వంటి వారి విగ్రహాలను కూల్చివేయడం చాలా బాధాకరమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకున్నదని, ప్రభుత్వ నిర్ణయం ఇంకా కాలేదని, విభజన తర్వాత ఏయే సమస్యలు వస్తాయో, వాటికి ఏయే పరిష్కార మార్గాలను చూపించాలో ఇప్పుడే చెప్పాలని, ఆ తర్వాతే విభజన ప్రక్రియ జరగాలని కిరణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్  మనది అనుకుని ప్రజలు ఇక్కడికి వచ్చారని, ఎంతో మంది ఇక్కడే పుట్టారని, వారి హోదా ఇప్పుడు ఏమిటి, రేపు ఏమిటో చెప్పవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలుంటే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయికి చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏకే ఆంటోనీ కమిటీని హైదరాబాద్ కు ఆహ్వానించి అభ్యంతరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. విభజిస్తే జలవివాదాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...