న్యూఢిల్లీ,ఆగస్టు 7: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకె ఆంటోనీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. హైలెవల్ కమిటీ ఛైర్మన్గా ఆంటోనీ, కమిటీ సభ్యులుగా కేంద్ర మంత్రులు అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై సీమాంధ్ర ప్రజల నుంచి హైలెవల్ కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందనక్కరలేదని, అన్ని ప్రాంతాల సమస్యలనూ విని వాటికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంపై నిర్ణయం జరిగిపోయిందని, ఇక దానిపై వెనక్కి వెళ్లేది లేదని ఆయన చెప్పారు. అయితే ఎవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా, ఏ కోరికలు ఉన్నా ఇప్పుడు నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి నివేదించాలని, అన్ని సమస్యలనూ ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment