Sunday, August 25, 2013

"చల్లని రాజా ఓ చందమామా" గాయకుని మృతి

భువనేశ్వర్, ఆగస్టు 25: సుప్రసిద్ధ క్లాసికల్ సింగర్ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి తన 79వ ఏట ఆదివారం నాడు ఇక్కడ కన్ను మూశారు. కోరాపుట్ జిల్లాలోని గుణుపూర్ లో 1934 ఆగస్టు 10న జన్మించిన రఘునాథ్ పాణిగ్రహి  ఇలవేలుపు సినిమాలో "చల్లని రాజా ఓ చందమామా" పాట ద్వారా తెలుగు వారికి సుపరిచితుడు. ఒరియా, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అనేక పాటలు పాడారు. జయదేవుని ' గీతగోవిందం '  సంస్కృత రచనకు తనదైన శైలిలో గళ భాష్యం అందించారు. ఆయన భార్య సంజుక్త ఒడిస్సీ నృత్య కళాకారిణి 1997లో మరణించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...