Monday, August 26, 2013

గీతారెడ్డికి సీబీఐ సమన్లు

హైదరాబాద్,ఆగస్టు 26:  రాష్ట్రమంత్రి జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో మంగళవారం నాడు   సీబీఐ గీతారెడ్డిని విచారించనుంది.  గీతారెడ్డిని విచారించేందుకు  సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందారు.  గీతారెడ్డిని ఆమె నివాసంలోనే  సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...