హైదరాబాద్,ఆగస్టు 25: తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత తమ్మినేని సీతారాం రాజీనామా సమర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయిందని సీతారాం పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన 10 పేజిల బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. బలహీన ప్రభుత్వం, ప్రతిపక్షం ఉన్నందునే రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది అని తమ్మినేని అన్నారు. గతంలో ఎర్రం నాయుడు మృతి, ఇప్పుడు తమ్మినేని సీతారాం రాజీనామాతో తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో మరో గట్టి దెబ్బ తగిలింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment