న్యూఢిల్లీ, ఆగస్టు 6: రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యే వరకు రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలం మంగళవారం సోనియాను కలిశారు. భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కమిటీకి సమస్యలు వినిపించాలని సోనియా చెప్పారని పళ్లంరాజు అన్నప్పుడు-అంతవరకు ప్రక్రియ ఆగుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆగుతుందని పళ్లంరాజు సమాధానమిచ్చారు. తమ ప్రాంతంలోని ఆందోళనను సోనియాకు వివరించామని , ఒక ప్రాంతానికి పరిష్కారం చూపించారని, తమకు అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్రలో నెలకొని ఉందని చెప్పామని ఆయన అన్నారు. ''కమిటీని ప్రకటిస్తాం, ఆ కమిటీ ముందు అన్ని విషయాలూ చెప్పండని'' సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలని, వాటిని పరిశీలిస్తామని సోనియా చెప్పినట్లు ఆయన అన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు ఆయన విజ్ఝప్తి చేశారు. కాగా, హైదరాబాదును శాశ్వత రాజధానిగా ఉంచాలని కమిటీకి చెప్తామని, తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment