Monday, August 26, 2013

ఆహార భద్రత బిల్లుకు లోక్ సభ ఆమోదం

బిల్లుకు బీజేపీ అనుకూలం...అన్నాడీఎంకే వ్యతిరేకం
న్యూఢిల్లీ,ఆగస్టు 26:  యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును లోక్ సభ ఆమోదించింది. భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలకు భారీ సబ్సిడీతో ఆహార ధాన్యాలను అందించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు బిల్లుపై ఏకంగా ఎనిమిది గంటల పాటు చర్చ జరగింది.
ప్రతిపక్షాలు ఈ బిల్లుకు దాదాపు ౩00 సవరణలను ప్రతిపాదించగా, అన్నింటినీ తోసిపుచ్చారు. అయితే, ప్రధాన బిల్లుపై ఓటింగ్ జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఈ బిల్లుకు బీజేపీ మద్దతిస్తున్నట్లు విపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రకటించారు. బిల్లు అరకొరగా, బలహీనంగా ఉన్నా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము మద్దతిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దీన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. అన్నాడీఎంకే మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...