Monday, August 26, 2013

సోనియాకు అస్వస్థత- ఎయిమ్స్ లో చికిత్స

న్యూఢిల్లీ,ఆగస్టు 26: : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు.  ఆహార భద్రతా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుండగా, అందులో పాల్గొనకుండానే  కేంద్ర మంత్రి కుమారి షెల్జా, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె ఉన్నట్టుండి బయటకు వెళ్లిపోయారు. పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న సోనియాను షెల్జా చేయి పట్టుకుని మరీ కారు వరకు తీసుకెళ్లారు. గత రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న సోనియాగాంధీ, కేవలం ఆహార భద్రత బిల్లు కోసమే పార్లమెంటుకు హాజరయ్యారు. కానీ, ఓటింగ్ పూర్తయ్యే వరకు సభలో్ కూర్చోడానికి కూడా ఆమెకు ఓపిక లేకపోవడంతో షెల్జా, రాహుల్ దగ్గరుండి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 67 ఏళ్ల సోనియాగాంధీని ఎయిమ్స్ లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆమె ఇంటికి వెళ్ళారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...