Sunday, August 18, 2013

హైదరాబాద్ తో పెట్టుకోవద్దు...టీఆర్‌ఎస్

హైదరాబాద్, ఆగస్టు 18:  హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేయాలనుకుంటే రణరంగమే అవుతుందని టీఆర్‌ఎస్ హెచ్చరించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప మరే ప్రత్యామ్నాయానికీ ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. ‘హైదరాబాద్ ఆదాయంలో వాటా అడిగినా, పదేళ్ల పాటు శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉంటాయన్నా అంగీకరించే ప్రసక్తే లేదని’  ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో అధినేత కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశం స్పష్టం చేసింది.   అంతేగాక పదేళ్ల కాలం పాటు కూడా హైదరాబాద్‌ను ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అని మాత్రమే పేర్కొనాలంటూ డిమాండ్ చేయాలన్న భావన వ్యక్తమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...