పాట్నా,ఆగస్టు 19: పాట్నాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖగారియా జిల్లాలోని ధమారాఘాట్ స్టేషన్లో సోమవారం ఉదయం రైల్వే ట్రాక్ దాటుతున్నవారిపై నుంచి ఎదురుగా వస్తున్న మరో రైలు దూసుకుపోవడంతో 37 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 13 మంది మహిళలు, నలుగురు పిల్లలున్నారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ధమారాఘాట్ స్టేషన్కు వచ్చి ఆగింది. ఈ రైలు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దిగారు. పవిత్ర శ్రావణ మాసం.. కావడంతో వీరంతా సమీపంలోని కాత్యాయనిస్థాన్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడానికి వెళ్తున్నారు. అవతలి వైపు వెళ్లడానికి ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు నుంచి సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్ప్రెస్ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. వాస్తవానికి ఈ ఎక్స్ప్రెస్ ధమారాఘాట్ స్టేషన్లో ఆగదు. దీంతో డ్రైవరు అదే వేగంతో రైలును పోనివ్వడం, పట్టాలపై నడుస్తున్నవారంతా చక్రాల కింద పడిపోయి చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment