Sunday, August 18, 2013

సమ్మె విరమించిన జూడాలు...

హైదరాబాద్, ఆగస్టు 18:  జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా  చేస్తున్న సమ్మెను విరమించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.   సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఫణి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.   డిమాండ్ల పరిష్కారంపై సర్కారు  వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...