Saturday, August 24, 2013

మరో కమిటీ వేస్తాం: సోనియా

హైదరాబాద్,ఆగస్టు 24:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరఫన ఓ కమిటీ వేస్తామని యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆ కమిటీ వేస్తామని ఆమె చెప్పారు. తెలంగాణపై ప్రకటన వెలువరించిన తర్వాత ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆంటోనీ కమిటీని వేశామన్న సోనియా కొత్తగా  ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ విధివిధానాల గురించి మాత్రం వివరించలేదు. అయితే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడానికి అనుగుణంగానే  ఆ కమిటీ పనిచేయవచ్చునని అంటున్నారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్న సోనియా  ఈ విషయంలో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం చేయబోమని  చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...