Saturday, August 24, 2013

అవనిగడ్డ ఉప ఎన్నిక: టి.డి.పి. గెలుపు

హైదరాబాద్,ఆగస్టు 24:   కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్  61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యానికి 3,389 ఓట్లు వచ్చాయి. అంబటి శ్రీహరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ కోరడంతో  కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు.  అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోలింగ్ అనివార్యం అయింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో అవనిగడ్డకు ఉప ఎన్నిక జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...