Wednesday, August 28, 2013

డాలర్ తో రూపాయి 68.80 ---బంగారం రు. 34,500

ముంబై,ఆగస్టు 28:  అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలహీనపడటంతో బులియన్ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది.  పది గ్రాముల బంగారం ధర 34,500 రూపాయలు ట్రేడ్ అయింది.  బంగారం ధరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. గత సంవత్సరం నవంబర్ 27న బంగారం 32975 రూపాయలు నమోదు చేసుకోవడం ఇప్పటి వరకు గరిష్టం. కాగా బుధవారం మార్కెట్ లో వెండి 3700 రూపాయలు పెరిగి 58500 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి 68.80 వద్ద క్లోజ్ అవ్వడమే బంగారం, వెండి పెరుగుదలకు కారణమని  విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 17996 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 5285 వద్ద ముగిసాయి.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...