Thursday, August 29, 2013

జగన్ దీక్ష భగ్నం: ఉస్మానియకు తరలింపు

హైదరాబాద్, ఆగస్టు 29: చంచల్ గూడ జైల్లో ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.ఆయన ఆరోగ్యం క్షీణించండంతో రాత్రి 11:50 సమయంలో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  జగన్ తనకు తానుగా నడుచుకుంటూ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోంచి దిగి ఆస్పత్రిలోకి వెళ్లారు. కాగా,  ఆస్పత్రి వద్ద జగన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను అడ్డుకోడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.  చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు వెళ్లే మార్గం మొత్తాన్ని ముందుగానే పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...