Tuesday, July 9, 2013

వెస్టిండీస్ ఫై శ్రీలంక విజయం

 పోర్ట్ ఆఫ్ స్పెయిన్ , జులై 9:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడటంతో మ్యాచ్ ను సోమవారం కొనసాగించారు. 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఆటను కొనసాగించిన శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ విజయలక్ష్యాన్ని 41 ఓవర్లలో 230 పరుగులుగా నిర్ణయించారు. 230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్  41 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసింది.  శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...