హైదరాబాద్, జులై 9: సికిందరాబాద్ లోని సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన టీ మాస్టర్ వెంకటేష్, మహబూబ్ నగర్ కు చెందిన కిరణ్ ఉన్నారు. అలీ,భరత్, వెంకటేష్,కిరణ్ అనే మరో నలుగురు వర్కర్ల ఆచూకీ తెలియ రాలేదు. జీహెచ్ ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రంలోగా శిథిలాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. కాగా సిటీ లైట్ హోటల్ ప్రమాద ఘటన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పాత భవనాలను కూల్చివేయాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. దాదాపు 700 పాత భవనాలను గతంలోనే గుర్తించారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో 23, ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఎనిమిది భవనాలను గుర్తించారు. పాతభవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment