న్యూఢిల్లీ, జులై 27: ప్రత్యేక తెలంగాణ అంశంపై రాజకీయ క్రీడను కొనసాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. శుక్రవారం హస్తినలో మరోసారి రోజంతా హైడ్రామా నడిపింది. వార్ రూమ్ సమావేశాలు, కోర్ కమిటీ భేటీ అంటూ రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ అంశంలో ఇక చర్చలు ముగిశాయని, ఆంధ్రప్రదేశ్ విభజనకే మొగ్గు చూపుతున్నామని.. తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని తొలుత వార్ రూమ్లో రాష్ట్ర నేతలకు సంకేతాలిచ్చింది. విభజనకు సిద్ధంకావాలంటూ చెప్పిపంపింది. పార్టీ పెద్దలు దిగ్విజయ్సింగ్, గులాంనబీ ఆజాద్లు రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, రాబోయే పరిణామాలను ఎదుర్కోవలసిందేనంటూ నేతలకు చెప్పారుట. వార్ రూమ్ భేటీ తర్వాత.. ‘‘సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తీసుకున్న నిర్ణయాన్ని మేం మీకు తెలియజేస్తాం’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ మీడియాతో పేర్కొన్నారు.అయితే సాయంత్రం కోర్ కమిటీ ముగిసిన తర్వాత దిగ్విజయ్సింగ్ స్వరంలో స్పష్టమైన తేడా కనిపించింది. ‘‘చర్చలు ముగిశాయి.. ఇక కాంగ్రెస్, యూపీఏ నిర్ణయాల కోసం వేచిచూడాలి’’ అని ముక్తసరిగా వ్యాఖ్యానించటం ద్వారా సస్పెన్స్ ను సజీవంగా ఉంచారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment