వాషింగ్టన్, జులై 27: భారత విద్యార్థులు అధికంగా ఉన్న మరో అమెరికా విశ్వవిద్యాలయం మూతపడింది. మూడేళ్ల వ్యవధిలో మూతపడిన మూడో విశ్వవిద్యాలయం ఇది. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియాను తక్షణమే మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యూనివర్సిటీ ఐదేళ్లుగా 'యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్'కు చెందిన ఏ విభాగం నుంచీ గుర్తింపు పొందకపోవడమే మూసివేతకు కారణం. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియా(యూఎన్వీ) గడిచిన 15 ఏళ్లుగా వాషింగ్టన్ శివార్లలోగల అన్నాడేల్లోని ఓ కార్యాలయ భవనం కింది అంతస్తులో కొనసాగుతోంది. వర్జీనియాలోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్సీహెచ్ఈవీ) ఈ వర్సిటీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర విధ్యార్ధులు కూడా ఎక్కువే ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment