హరారే, జులై 27: జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండవ వండే లో భారత జట్టు 58 పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేను ఓడించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (127 బంతుల్లో 116; 11 ఫోర్లు; 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. దావన్కు తోడుగా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (74 బంతుల్లో 69; 6 ఫోర్లు) నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. చివర్లో వినయ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్లు) చేలరేగడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగుల భారీ స్కోరు సాధించింది. అటు బౌలర్లు సమష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వేను కట్టడి చేశారు. జింబాబ్వే 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉనాద్కట్కు నాలుగు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం ధావన్కు దక్కింది. మూడో వన్డే కూడా హరారేలోనే ఆదివారం జరుగుతుంది.
జింబాబ్వే
50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉనాద్కట్కు నాలుగు,
మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం ధావన్కు
దక్కింది. మూడో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది. - See more at:
http://sakshi.com/main/Fullstory.aspx?catid=642146&Categoryid=2&subcatid=24#sthash.WgyqxNfA.dpuf
No comments:
Post a Comment