Tuesday, July 2, 2013

'తేలిపోయే' దశకు తెలగాణా...

హైదరాబాద్, జూలై 1 : "నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా రాష్ట్రం నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయింది. రాష్ట్ర విభజన బాధ ఏమిటో నాకు తెలుసు. రాష్ట్ర విభజన అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండర్ వరకూ అందరూ విడిపోవాల్సిందే! సచివాలయం నుంచి అన్ని కార్యాలయాలూ పంచుకోవాల్సిందే! చివరికి కుర్చీలు, బల్లలు కూడా పంచుకోక తప్పని పరిస్థితి. విభజన తర్వాత... విద్యుదుత్పాదక సంస్థలన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉండగా, వినియోగదారులు మాత్రం మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. పంజాబ్, హర్యానా విడిపోయి 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన వివాదాలు తొలగిపోలేదూ' అని తెగ బాధ పడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశం తుది దశలో ఉందని, వారంలో జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించి  పది రోజుల్లో తేల్చేస్తాం'' అని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలని సూచించారు.  ఈసారి జరిగే కోర్‌కమిటీ భేటీకి  రాష్ట్రం నుంచి కిరణ్, బొత్సను కూడా పిలుస్తున్నామని వివరించారు. అయితే...వారిద్దరు సీమాం«ద్రులు కావడంతో.. కోర్ కమిటీ ముందు తెలంగాణ నుంచి వాణిని విన్పించేందుకు దామోదరను కూడా పిలుస్తామని దిగ్విజయ్ చెప్పారు.
 తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... అది దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉత్తమమైనదిగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా ఉండాలని తెలిపారు. "రాష్ట్రాన్ని కలిపే ఉంచాలా? విభజించాలా? అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీపరంగా ఎలాంటి వ్యూహం ఉండాలి? పరిపాలనపరంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలి? అనే అంశంపై రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిందిగా కిరణ్, రాజనరసింహ, బొత్సలను కోరాను'' అని దిగ్విజయ్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు'' అని వివరించారు. శ్రీకృష్ణ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...