Wednesday, July 3, 2013

జాడలేని వారు ఇంకా వేలల్లోనే...

ముగిసిన సహాయ చర్యలు...  
డెహ్రాడూన్, జులై 3:  కనీవినీ ఎరుగని వరద బీభత్సంతో అతలాకుతలమైన  ఉత్తరాఖండ్‌లో ఎట్టకేలకు సహాయ చర్యలు ముగిశాయి.  17 రోజులపాటు నిరాటంకంగా సాగిన సహాయక పనులు మంగళవారంతో పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహాయక కార్యక్రమంగా చెబుతున్న ఈ మహాక్రతువులో ఆర్మీ, వాయుసేన, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళానికి (ఎన్‌డీఆర్‌ఎఫ్) చెందిన సిబ్బంది అనేక సవాళ్లను అధిగమిస్తూ మొత్తం 1.10 లక్షల మందిని కాపాడారు. బద్రీనాథ్ నుంచి మంగళవారం 150 మందిని కాపాడడంతో సహాయక పనులు పరిసమాప్తమయ్యాయి. కాగా  మృతుల సంఖ్య, ఆచూకీలేని వారి సంఖ్య నేటికీ తేలలేదు. ఆచూకీలేని వారు 3 వేల మంది మాత్రమే అని అధికారిక లెక్కలు చెబుతున్నా.. వీరి సంఖ్య 11 వేలకుపైగా ఉండొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది.   బాధితులు, యాత్రికుల తరలింపు పూర్తిగా ముగిసినా కేదార్‌నాథ్‌లో దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు శవాల కుప్పలు.. మరోవైపు మట్టిదిబ్బల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో పరిసర ప్రాంతాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో వరుసగా నాలుగోరోజు సామూహిక అంత్యక్రియల ప్రక్రియకు ఆటంకం కలిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...