ప్రయాణీకులపై రూ.150 కోట్ల సెస్ వడ్డన
హైదరాబాద్ , జులై 2:
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మరోసారి తన దౌర్భాగ్యాన్ని చాటుకుంది. తన
సిబ్బంది జీత భత్యాలకోసం, తన న్ర్వహణ ఖర్చులకోసం ప్రయాణికులపై
నిస్సిగ్గుగా భారం మోపింది. దరిద్రపు గొట్టు ప్రభుత్వం కూడా ఇందుకు ఆమోదం
తెలిపింది. సెస్ పేరిట టికెట్కు ఒక రూపాయి వసూలు చేస్తారుట. సెస్ ద్వారా
వచ్చే నిధులను బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు, కొత్త బస్టాండ్ల
నిర్మాణం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని గొప్పగా నిబంధన పెట్టిన
సర్కార్ పీకేదేమిటో మరి... సిటీ సర్వీసులు, జిల్లా పరిధిలో తిరిగే
ఆర్డినరీ బస్సులకు మాత్రం సెస్ వసూలు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ (ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్,
వెన్నెల) బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరిపై రూ.1 భారం పడనుంది.
ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 23,500 బస్సులు ఉన్నాయి. రోజూ దాదాపు 1.4 కోట్ల
మంది ప్రయాణికులు సంస్థ సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం బస్సుల
సంఖ్యలో 40 శాతం ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు
ఉన్నాయి. మొత్తం ప్రయాణికుల్లో 30 శాతం మంది వీటిలోప్రయాణిస్తారు. అంటే
రోజూ దాదాపు 40 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఈ సెస్ భారాన్ని భరించాల్సి
ఉంటుంది. అంటే ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరనుంది.
No comments:
Post a Comment