Saturday, July 6, 2013

ట్రై సిరీస్... కీలక మ్యాచ్ లో గెలిచిన భారత్

ట్రినిటాడ్, జులై 6:  ముక్కోణపు టోర్నిలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో వెస్టిండీస్ పై భారత జట్టు 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచి పోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ లక్ష్యాన్ని 39 ఓవర్లలో 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. వెస్టిండీస్ జట్టు 171 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ (45), రోచ్ (34), నరైన్(24) లు భారత బౌలర్లను కొంత ప్రతిఘటించగా మిగితావారందరూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు.  భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ మూడేసి వికెట్లు, ఇషాంత్ శర్మ, జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.  అంతకుముందు వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ధావన్, రోహిత్ లు కలిసి తొలి వికెట్ కు 123 పరుగులు జోడించారు. 69 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించిన శిఖర్ ధావన్ ను రోచ్ అవుట్ చేయగా, రోహిత్ శర్మను 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ పెవిలియన్ కు పంపాడు. ఆతర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (102) విజృంభించి సెంచరీ చేయడంతో వెస్టిండీస్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు   లభించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...