Friday, July 5, 2013

ఐదు కిలోలతో ఆహార భద్రత....

న్యూఢిల్లీ,జులై 5:  ఆహార భద్రత  ఆర్డినెన్స్‌ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఆర్డినెన్స్ పై  కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ఆర్డినెన్స్ ను ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్డినెన్స్ తక్షణం అమల్లోకి వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసుకున్న తరువాత.. ఆగస్టు నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుంది.  దేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు (60 శాతానికి పైగా) దీని వల్ల లబ్ధి చేకూరనుంది. కుటుంబంలోని ఒక్కొక్కరికి నెలకు కేజీ రూపాయి నుంచి మూడు రూపాయల లోపు సబ్సిడీ ధరతో ఐదు కేజీల ఆహార ధాన్యాలను ఇచ్చేందుకు ఈ బిల్లు రూపొందింది. ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం భరించడానికి సిద్ధమవుతున్న ఈ పధకం ప్రపంచంలోనే అతి బృహత్తర కార్యక్రమం  కావడం విశేషం. వాస్తవానికి ఈ పథకాన్ని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. అయితే, యూపీఏ సర్కారుపై వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆర్డినెన్స్ రూపంలో పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని యూపీఏ సిద్ధమైంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోదం తప్పనిసరి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...