Tuesday, July 23, 2013

మొన్న హోటల్ భవనం...నేడు ప్రహరీ గోడ...నగరం కూలుతోంది...

హైదరాబాద్, జులై 23:  సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలి 18 మంది  మృతి చెందిన్ ఘటన  మరువక ముందే  మరో ప్రమాదం జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలకు  మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజె కాలనీలో ఒక కాంప్లెక్స్ ప్రహరీ గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చందిన వెంకటయ్య, మహదేవ్‌ కుటుంబాలు స్థానికంగా గుడిసెలు వేసుకొని కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తన్నారు. వర్షాల కారణంగా పక్కనే ఉన్న గోడ నాని కూలి వారి ఇళ్ల పైన పడింది. వెంకటయ్య, మహదేవ్, పద్మ, ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందారు. శిథిలాల కింద చిక్కున్న లిల్లీ అనే చిన్నారని కాపాడారు. మరో చిన్నారి శిథిలాల కిందే ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆరు గంటల అనంతరం రక్షించారు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.  క్షేమంగా బయటపడ్డ చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని రఘువీరా చెప్పారు. మహదేవ్ కుటుంబానికి రూ.8.5 లక్షలు, వెంకటయ్య కుటుంబానికి రూ.6.5 లక్షళ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఇటీవలే సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 18 మంది వరకు మృతి చెందారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...