హైదరాబాద్, జులై 23: సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలి 18 మంది మృతి చెందిన్ ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలకు మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజె కాలనీలో ఒక కాంప్లెక్స్ ప్రహరీ గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చందిన వెంకటయ్య, మహదేవ్ కుటుంబాలు స్థానికంగా గుడిసెలు వేసుకొని కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తన్నారు. వర్షాల కారణంగా పక్కనే ఉన్న గోడ నాని కూలి వారి ఇళ్ల పైన పడింది. వెంకటయ్య, మహదేవ్, పద్మ, ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందారు. శిథిలాల కింద చిక్కున్న లిల్లీ అనే చిన్నారని కాపాడారు. మరో చిన్నారి శిథిలాల కిందే ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆరు గంటల అనంతరం రక్షించారు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షేమంగా బయటపడ్డ చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని రఘువీరా చెప్పారు. మహదేవ్ కుటుంబానికి రూ.8.5 లక్షలు, వెంకటయ్య కుటుంబానికి రూ.6.5 లక్షళ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా ఇటీవలే సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 18 మంది వరకు మృతి చెందారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment