Wednesday, July 24, 2013

మళ్ళీ ముగ్గురు.............లకు పిలుపు...

న్యూఢిల్లీ, జులై 24: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు అధిష్టానం నుండి మరోసారి పిలుపు వచ్చింది. దామోదర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బొత్స, కిరణ్‌లు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు  కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 28న సిడబ్ల్యూసి సమావేశంలో జరిగే అజెండా ఖరారు పైన చర్చించనున్నారు. సిడబ్ల్యూసిలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాఐ కూస్తోంది. అన్నదమ్ములు విడిపోతానంటే ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో అలాగే కాంగ్రెస్  అధిష్టానం ఇప్పుడు ఆలోచిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్య కొసమెరుపు...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...